SKLM: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆ సంఘం ప్రతినిధి తిరుపతిరావు డిమాండ్ చేశారు. టెక్నికల్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి 80 అడుగుల రహదారి వరకు నినాదాలు చేస్తూ కదిలారు.