కృష్ణ: పెడన పురపాలక సంఘంలో టీడీపీ తరఫున ఏకైక కౌన్సిలర్గా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరి (54) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం సాయంత్రం తన నివాసంలో మృతి చెందారు. నాగమల్లేశ్వరి మృతి పట్ల పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.