కృష్ణా: పోరంకిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిగడప నుంచి పోరంకి వైపు వెళుతున్న కారు త్రినేత్ర హాస్పటల్ వద్ద పోరంకి గ్రామానికి చెందిన అలివేలు మంగమ్మ (79), కుమార్తె నాగ శిరోమణిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా, వారిని వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలివేలు మంగమ్మ మృతి చెందారు. నాగ శిరోమణి ఆరోగ్యం నిలకడగా ఉంది.