E.G: 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాజమండ్రి నగరపాలక సంస్థకు రూ. 18946.50 లక్షల ఆదాయం సమకూరనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వార్షిక బడ్జెట్ వివరాలను ఆయన తెలిపారు. ఇదే కాలంలో సాధారణ నిధుల నుంచి వివిధ విభాగాలలో రూ.24875.30 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు.