KRNL: కృష్ణమ్మ ఒడి నుంచి క్రమంగా సంగమేశ్వరం గర్భాలయం బయటపడుతోంది. గతేడాది జూన్ 27న గర్భాలయం పూర్తి కృష్ణమ్మ ఒడిలో జలాధివాసమయ్యింది. తిరిగి కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం శిఖరభాగం నుంచి 11 అడుగుల మేర బయటపడింది. రెండు వారాల సమయంలో పూర్తి ఆలయం బయట పడే అవకాశముందని పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.