BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.