సత్యసాయి: తనకల్లు(మం) బాలసముద్రం పంచాయతీ గోవిందువారిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యకార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.