కర్నూలు: 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారానికి అధికారులు కృషి చేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై ఛైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే ప్రధాని లక్ష్యమన్నారు.