పార్వతీపురం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ రామ నవమి వేడుకల్లో జిల్లా రెండోవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.