CTR: గుడిపల్లి మండలం చిన్న గొల్లపల్లిలో TATA సంజీవిని అవగాహన కార్యక్రమం జరిగింది. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ బాబు పాల్గొని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రజల ఆరోగ్య స్థితిని ముందుగానే గుర్తించి, సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడమే సంజీవిని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.