ASR: గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ ఎస్సై సురేష్ హెచ్చరించారు. బుధవారం డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తమ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహించారు. అనంతరం, గ్రామస్తులతో సమావేశమయ్యారు.