అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ పరిధిలో TDP పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు మంత్రికి వివరించారు.