NTR: నందిగామ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో చందర్లపాడు బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎక్సైజ్ సీఐ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.