ప్రకాశం: దర్శి పట్టణంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు దర్శి టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.