CTR: శ్రీ మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శివపార్వతుల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై ఊరేగింపు చేపట్టారు. అత్యంత సుందరంగా వాహనాన్ని అలంకరణ చేసి పూజలు చేసి ఆలయం వద్ద నుంచి మేళతాళాల నడుమ పురవీధులలో రాత్రంతా విహరించేలా ఏర్పాటు చేశారు. ఉభయదారులుగా సజ్జన కులస్తులు వ్యవహరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.