PPM: బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ ప్రసంశించారు. ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు, పటేల్ వర్ధంతి కార్యక్రమం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.