ASR: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయ సాధకుడిగా, పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు.