NDL: ఇవ్వాల సాయంత్రం కురిసిన వర్షానికి గోడ కూలి అభి (2) అనే బాలుడు మృతి చెందిన సంఘటన పగిడ్యాల మండలo, ప్రాతకోటలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న MLA జయసూర్య నంది కొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అభి కుటుంబ సభ్యులను పరామర్శించి, బాలుడు కుటుంబ పరిస్థితిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని MROను ఆదేశించారు. ప్రభుత్వo నుంచి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.