AKP: గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదపడుతున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. సోమవారం లింగాపురం, టి. జగ్గంపేట గ్రామాలకు స్వచ్ఛ రథంతో పాటు ఎంపీడీవో వెళ్లారు. ప్రజల్లో స్వచ్ఛరథంపై అవగాహన కల్పించారు. చిత్తు కాగితాలు, అట్టపెట్టెలు, పనికిరాని ఇనుప సామాన్లు ఇచ్చి కావలసిన నిత్యవసర సరుకులను తీసుకువెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.
Tags :