కడపలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.17,98,500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో భగత్ సింగ్ పార్క్ సమీపంలోని సంగం ఫంక్షన్ హాల్ వద్ద దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.