ASR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్, జిల్లా అధికారులతో కలిసి ఓనూరు, నందిగరువు గ్రామాలను సందర్శించారు. అంగన్వాడీ సెంటర్, ఎంపీపీ స్కూల్లో పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ముచ్చటించే ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే, నందిగరువులో ప్రజలతో జరిగే మాటామంతి సభా స్థలాలను పరిశీలించారు.