PLD: సత్తెనపల్లి రోడ్డు, రాయపాడు రోడ్డులో పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లను శుక్రవారం ఎమ్మెల్యే చదలవాడ సందర్శించారు. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతోనే సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆటో కార్మికులు, రోజువారీ కూలీలు, పేద ప్రజలు కేవలం రూ. 5కే కడుపునిండా భోజనం పొందవచ్చని చెప్పారు.