VZM: జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. పోలీసు స్టేషను పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలన్నారు.