PPM: పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద చేపడుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం పరిశీలించారు. వర్షాకాలానికి ముందుగానే చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి నిల్వలు, మురుగు ప్రవాహం సక్రమంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.