ATP: హంద్రీ-నీవా నుంచి PABR కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం అసెంబ్లీలో కోరారు. దీని ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 50 చెరువులకు నీరు అందించి సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.