శ్రీకాకుళం జిల్లాలో రైతులు పండిస్తున్న మొక్కజొన్న, జీడి పంటలకు ప్రభుత్వం మద్దతుధర కల్పించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మోహన్ రావు అన్నారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదు నమోదు మరియు పరిష్కార వేదికకు దరఖాస్తు సమర్పించారు. 80 కేజీల జీడిపిక్కలు బస్తాకు 16వేలు మద్దతుధర ఇవ్వాలన్నారు.