VSP: లంకెలపాలెం వద్ద సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొత్తకోటకు చెందిన సాలాపు రాంకీ అనే యువకుడు గాయపడ్డాడు. అతను శ్రీరామ ఫైనాన్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బైక్పై సోమవారం లంకెలపాలెం వెళ్లాడు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో రాంకీ నడుము, కాలు నుజ్జునుజ్జు అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు.