NLR: కందుకూరు పట్టణంలోని 13వ వార్డు బండపాలెం, రామ్ నగర్, ఆనందపురం రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అనూష, పార్టీ నేతలతో కలిసి ఆయన రోడ్లు, కాలువలను పరిశీలించారు. కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆక్రమణలు, పూడిక వంటి సమస్యలను గమనించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.