NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడులో IPL క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న 8 మంది యువకులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. పలువురు క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో కొందరిని విచారించామన్నారు. వారిలో 8 మంది బెట్టింగుకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి రూ.24వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.