ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి యన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద రూ.50 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని ఆలయ ఈవో విజయ రాజు బుధవారం మీడియాకు తెలిపారు. మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి, గ్రామస్తులతో కలిసి నూతన డ్రైనేజీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు.