PLD: అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత 3 నెలల 9 రోజులకు గాను మొత్తం రూ. 41,42,621 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో కేవలం ప్రధాన హుండీల ద్వారానే రూ. 40.42 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.