NDL: బ్రాహ్మణ కొట్కూరు గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. వారి నుంచి రూ. 42,290 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.