ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శుక్రవారం ఉదయం రైలులో అనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజేశ్, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నేడు జిల్లాలో నిర్వహించనున్న పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై స్థానిక నేతలతో చర్చించనున్నారు.