AKP: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రశాంతత చేకూరుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్.రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈ నెల 26న ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.