W.G: ఉండి మండలం పెదపుల్లేరులో సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సాయం ఆశించకుండా రూ. 5 కోట్లకు పైగా వ్యయంతో శివాలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారని అన్నారు. సమస్యలు, మానసిక ఒత్తిళ్ళ నుంచి గుడికి వెళితే ఉపశమనం కలుగుతుందన్నారు.