ASR: రాష్ట్ర స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా అరకులోయ మండలం, కంఠబౌసుగూడ జీహెచ్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని శెట్టి రోజారాణి ఎంపికయ్యారు. ఈమె 24 ఏళ్లుగా తెలుగు బోధిస్తున్నారు. ఈమె భోధనలో పలువురు విద్యార్థులు తెలుగులో నూటికి నూరు మార్కులు సాధించారు. బడిమానేసిన పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి మరల బడికి వచ్చేలా చేశారు. పేద విద్యార్ధులను దత్తత తీసుకుని చదివించారు.