ప్రకాశం: మార్కాపురం మండలం తిప్పాయపాలెం, చింతకుంట్ల గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో వేసే పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆ గ్రామంలోని ఎరువుల దుకాణాలను తనిఖీలు చేసి, రికార్డులను పరిశీలించారు.