కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్లలో భాగంగా ఇవాళ 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉకాయపల్లి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రత నిర్వహణను సమీక్షించారు. హాజరు నమోదును కూడా పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.