SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ మార్కెట్ దరి గొడగల వీధి వద్ద సంవత్సరాల తరబడి చెత్త నిలువలు పేరుకు పోయాయని స్థానికులు తెలియజేశారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో భరించలేకపోతున్నామని, పిల్లాపాపలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.