విశాఖ-కాకినాడ పోర్టు-విశాఖ పాసింజర్ మెము రైలును బుధవారం రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ రైలు అనకాపల్లి, ఎలమంచిలి నర్సీపట్నం రోడ్డు మీదుగా నడుస్తుంది. భద్రత పనుల కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.