CTR: పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్గా సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.