TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ప్రారంభించారు. 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి సుమారు రూ.15 లక్షల నిధులతో ఈ రోడ్డు నిర్మించారు. అనంతరం ఆయన వెలుగు సంఘం మహిళల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా తయారవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.