E.G: కొవ్వూరు పట్టణ పరిధిలోని నందమూరులో విద్యుత్ షాక్కు గురై శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. కాగా రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.