గుంటూరు మిర్చి యార్డును ఇవాళ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో పలు అవకతవకలను గుర్తించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై బిల్లులు లేకుండానే మిర్చి లారీలు బయటకు వెళ్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల యార్డు ఆదాయానికి నష్టం జరుగుతోందని తెలిపారు. అవినీతి అరికట్టేందుకు ఛైర్మన్ కుర్రా అప్పారావు ప్రయత్నిస్తున్నా పరిస్థితి దారుణంగా ఉందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.