KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో పురపాలక కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ఇవాళ నిర్వహించారు. మున్సిపల్, మెప్మా, సచివాలయ సిబ్బంది కలిసి జీరో వేస్ట్ కలెక్షన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.