ELR: తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలన చాటి చెప్పిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కిందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింధు, చందు, అయ్యప్ప, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.