SKLM: ఆమదాలవలస మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవి రత్నకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో మార్చి 4వ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.