సత్యసాయి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఫయాజ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని ఆయన తెలిపారు.