అల్లూరి: తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్సు ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి 3 లక్షల మందిని అవుట్ సోర్సింగ్ పేరిట, మరో లక్ష మందిని కాంట్రాక్టు పేరిట తక్కువ వేతనాలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికైనా తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.