RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ చికెన్ షాప్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చికెన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సింగ్ విధానం తెస్తోందని, నాణ్యతతో పాటు పరిశుభ్రత ఉన్న మాంసం అమ్మకాలు జరపాలని సూచించారు.